పురుషాధిక్య భావజాలం వీడాలి. మనిషిని మనిషిగా చూడగలగాలి. మాటల్లోనే కాదు. చేతల్లోనూ తనలో సగభాగంగా సహధర్మచారిణిని అర్ధం చేసుకోవాలి. అంగీకరించాలి. ఇలాంటి ఇంటి వాతావరణం పిల్లల హృదయాలను స్పృశిస్తుంది,వికసింపజేస్తుంది. 'నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగ పలికే, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము...' అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటనే జీవితాన మననం చేసుకోవాల్సిన సందర్భాలు చాలానే వుండొచ్చు. 'భార్య అతనికి తోడునీడ..! 'భర్త' ఆమెకు బతుకంతా నమ్మకం. అసలు తొలిరోజుల్లోనే 'ఈమె నాకు సరియైన జోడీ' అన్న భావం పురుషుడికి కలగాలి. 'ఇతడు నాకు కొండంత అండ..' అన్న భరోసా ఆమెకు చేకూరాలి. 'నీవు లేని నేను లేనులే..అదీ నిజములే...! పూవు లేని తావి నిలువ లేదులేే..ఇదీ నిజములే..!' అని సినీ కవి అన్నట్టు..' రెండు వేణువులు: ఒకటే స్వరం. రెండు పుష్పాలు: ఒకటే పరిమళం. రెండు దీపాలు: ఒకటే వెలుగు. రెండు పెదాలు: ఒకటే వాక్కు. రెండు నేత్రాలు: ఒకటే దృశ్యం. వారిద్దరూ ఒకటే విశ్వం..' అని మహారాష్ట్ర భక్తకవి జ్ఞానేశ్వర్ అంటారు. అంటే ఆలుమగలు- ఆడ, మగగా మిగిలిపోకుండా భార్యాభర్తలుగా ఓ గూట్లోకి చేరి ఒకరికొకరిగా ఒక్కటైనప్పుడే సమైక్య జీవన సరాగ మాలిక. అప్పుడే సమభావం, సహధర్మం అనే పసందైన మేళవింపు ప్రతిఫలిస్తుంది. అది రెండు మంచి మనసుల మధ్య స్థిరంగా నిలిచే ఒకానొక గొప్ప నిర్వచనం కూడా అవుతుంది. 'రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా! మధుపం తను తాకనిదే మందారం మురిసేనా! మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే' అని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓ గీత రచనలో చెప్పినట్లు పెళ్లయిన తొలినాళల్లో పురుషుడు ఇలా కోరుకున్నా, స్త్రీ కోరుకొనేది వేరే వుంది. అతడి సమక్షంలో తానుండగా, తండ్రి గుర్తొచ్చినా బెంగ కలగకూడదు. మదిలో తల్లి మెదిలినా కన్నీళ్లు పెట్టకూడదు. అసలు పుట్టింటివారెవరూ తనవద్ద లేరనే దిగులే వుండకూడదు. ఆ విధంగా అతడే ఆమెకు అన్నీ తానై మెలగాలి. అలా అయిననాడు ఆమె నవ్వితే అతడు నవ్వాలి. ఆమెకు ముల్లు గుచ్చుకుంటే అతను విలవిలలాడాలి. ఆమెకు గాయమైతే అతడు నవనీతం పూయాలి. ఆమె నల్లని జడలో అతను మల్లియలా మెరవాలి. అటువంటి ప్రేమమూర్తి సన్నిధిలో ఆమె మనసు రాగరంజితం కావాలి. అలాంటి మధుర క్షణాల్లో ఆమె 'అతడొస్తూ వసంతాన్ని వెంట తెస్తాడు..' అంటూ మురిసిపోతుంది. అదీ సుమధుర దాంపత్యబంధం అంటే! అరమరికల్లేని అలాంటి అన్యోన్య దాంపత్యం మధురగీతంలా సుతిమెత్తగా సాగిపోతుంది.
ఇద్దరు స్త్రీ పురుషులూ కలిసి జీవితకాలం గడుపుతూ, సమాజానికి క్రమబద్దమైన సంతానం, వారసత్వం, సంపదలను అందించటానికి ఏర్పడినదే వివాహవ్యవస్థ స్వరూపం. ఇందులో భార్యా భర్త ప్రధాన పాత్ర ధారులు. భర్తంటే...తాళీ, తండ్రీ, తోడూ అనే మూడు ముళ్ళు కట్టి, వాటికి బద్దుడైన పురుషుడు. ఆమెకూ, ఆమె బిడ్డలకూ తను ఒక నీడలా మారి బాధ్యత వహించాలి. అప్పుడే అతను భర్తగా మన్నింపబడతాడు. తెలియని మనిషిని పెళ్ళి అనే ఒక కార్యక్రమంతోనే ఆడది అంతగా నమ్ముతుందంటే కారణం... ఈ విలువను అతను ఇచ్చితీరతాడనే విశ్వాసమే. తన ప్రాణoకి సైతం తెగించి అతని బిడ్డలకు తల్లీ అవుతుందంటే కారణం, భర్త అనే స్థానానికి గల తండ్రి అనే రూపాంతరం. ఆ విశ్వాసమే వివాహం అనే మహా వేధికకు నిలయమయ్యింది తప్ప, మరేదో మంత్రం వారిద్దరిమధ్యనా కట్లుకట్టలేదు....
ఒక కొడుకు తన తల్లి తో ఇలా అన్నాడు . అమ్మనువ్వు నన్ను నీ కోడlలుని చాలా ఇబ్బందిపెడుతున్నావు .నిన్ను చూస్తుంటే నాకు చిరాకొస్తుంది రోజు మీ ఇద్దరకి ఏదో గొడవ జరుగుతూనెఉన్నది ఇంట్లో మనశాంతి లేకుండాపోయింది నేను సంతోషం గా ఉండాలంటే నువ్వు మాకు దూరంగా ఉండటమే మంచిది అనిపిస్తుంది అందుకే నిన్ను బాగా చూసుకొనే ఆశ్రమం ఒకటుంది వాళ్ళకి నేను విరాళం బాగా ఇచ్చను వాళ్ళు నిన్ను మహారాణి లా చూసుకొంటారు వెళ్తావా .............? దానికి ఆ తల్లి ఇలా అంది నాయినా నీ పెళ్ళాం చెప్పిన మాటలు నమ్మి నన్ను వెళ్ళిపోమ్మంట్టునావు.వెళ్ళిపోతాను తప్పకుండ వెళ్ళిపొతాను కానీ వెళ్ళే ముందు ఓ చిన్న కోరిక తిర్చగలవా ......? ఆ కోరిక నువ్వు తిర్చితే జీవితం లొ నీకు మళ్ళి కనపడను హ తీర్చగలను అమ్మ చెప్పు ఏం కావాలో చెప్పమ్మా చెప్పు ?????? అదే నువ్వు ఇప్పుడున్నావే అమ్మ అనే పధం నువ్వు ఎప్పుడు అనవద్దు .అమ్మ అని నువ్వు ఇక మీదట పలకనే కూడదు అలా చెయ్యగలవా ?? ఓసి ఇంతేనా ఇంకా నువ్వు ఏం ఆడుగుతావుఅనుకున్నాను .సరే ఇకనించి అమ్మ ఆనే పదం నా పెదాలు పలకవు సరేనా .... సరే నేను ఇక వెళ్తాను నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి. కాని కాని నాకు ఇచ్చిన మాట మర్చిపోకు సరేనా సరి సరే గాని ఆగు నీ బట్టలసంచి ఇస్తాను .....అంటూ గది లొపలకి వేల్లభోయాడు , ఇంతలో గడప తన కాలికి తగిలింది అమ్మ అని బాధతో గట్టిగ అరిచాడు అది చుసిన వాల్లమ్మ నవ్వుకుంటూ అక్కడనించి వెళ్ళిపోయింది నీతి ...... అమ్మ ఆనే ఫధం కేవలం మన పెదాల మీదనే కాదు మన మన మనసులొనె ముద్రించాడు ఆ దేవుడు. అమ్మ అని అనకుండా ఉండటం ఆ దేవుని వల్ల కుడా కాదు మానవమాత్రులం మనమెంత . ఒక కొడుకు తన తల్లి తో ఇలా అన్నాడు . అమ్మనువ్వు నన్ను నీ కోడlలుని చాలా ఇబ్బందిపెడుతున్నావు .నిన్ను చూస్తుంటే నాకు చిరాకొస్తుంది రోజు మీ ఇద్దరకి ఏదో గొడవ జరుగుతూనెఉన్నది ఇంట్లో మనశాంతి లేకుండాపోయింది నేను సంతోషం గా ఉండాలంటే నువ్వు మాకు దూరంగా ఉండటమే మంచిది అనిపిస్తుంది అందుకే నిన్ను బాగా చూసుకొనే ఆశ్రమం ఒకటుంది వాళ్ళకి నేను విరాళం బాగా ఇచ్చను వాళ్ళు నిన్ను మహారాణి లా చూసుకొంటారు వెళ్తావా .............? దానికి ఆ తల్లి ఇలా అంది నాయినా నీ పెళ్ళాం చెప్పిన మాటలు నమ్మి నన్ను వెళ్ళిపోమ్మంట్టునావు.వెళ్ళిపోతాను తప్పకుండ వెళ్ళిపొతాను కానీ వెళ్ళే ముందు ఓ చిన్న కోరిక తిర్చగలవా ......? ఆ కోరిక నువ్వు తిర్చితే జీవితం లొ నీకు మళ్ళి కనపడను హ తీర్చగలను అమ్మ చెప్పు ఏం కావాలో చెప్పమ్మా చెప్పు ?????? అదే నువ్వు ఇప్పుడున్నావే అమ్మ అనే పధం నువ్వు ఎప్పుడు అనవద్దు .అమ్మ అని నువ్వు ఇక మీదట పలకనే కూడదు అలా చెయ్యగలవా ?? ఓసి ఇంతేనా ఇంకా నువ్వు ఏం ఆడుగుతావుఅనుకున్నాను .సరే ఇకనించి అమ్మ ఆనే పదం నా పెదాలు పలకవు సరేనా .... సరే నేను ఇక వెళ్తాను నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి. కాని కాని నాకు ఇచ్చిన మాట మర్చిపోకు సరేనా సరి సరే గాని ఆగు నీ బట్టలసంచి ఇస్తాను .....అంటూ గది లొపలకి వేల్లభోయాడు , ఇంతలో గడప తన కాలికి తగిలింది అమ్మ అని బాధతో గట్టిగ అరిచాడు అది చుసిన వాల్లమ్మ నవ్వుకుంటూ అక్కడనించి వెళ్ళిపోయింది నీతి ...... అమ్మ ఆనే ఫధం కేవలం మన పెదాల మీదనే కాదు మన మన మనసులొనె ముద్రించాడు ఆ దేవుడు. అమ్మ అని అనకుండా ఉండటం ఆ దేవుని వల్ల కుడా కాదు మానవమాత్రులం మనమెంత .