ఝామ్మున పెళ్లయిపోయింది. వధూవరులిద్దరూ హనీమూన్ బయలుదేరుతున్నారు. పెళ్లి
కూతురు తల్లి కుమార్తె చేతిలో ఓ బ్యాంక్ పాస్ బుక్ పెట్టి చెప్పింది.
‘సంసారం అన్నాక కష్ట సుఖాలు వుంటాయి. నీకు బాగా సంతోషం కలిగిన రోజున ఎంతో
కొంత సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చెయ్యి. ఆనందం కలిగించిన కారణాన్ని కూడా
అందులో గుర్తుగా రాసుకో. పుస్తకం పారేసుకోకు. చెప్పింది మరచిపోకు’
గిర్రున ఏడాది తిరిగింది. పండంటి బాబు పుట్టాడు. ఆ సంతోషానికి గుర్తుగా కొంత డబ్బు డిపాజిట్ చేసింది.
నెలలు గడిచాయి. ఆమెకు జీతం పెరిగింది.
పెరుగుతున్నఖర్చులకు తోడుగా జీతం పెరగడం కంటే ఆనందం ఏముంటుంది. దానికి
గుర్తుగా మరికొంత సొమ్ము బ్యాంకులో చేరింది. మరి కొన్నాళ్ళకి అతడికి
ప్రమోషన్. రెట్టింపు జీతం. కారు కొన్నారు. మంచి జరిగినప్పుడల్లా బ్యాంక్
డిపాజిట్ పెరుగుతూనే వుంది.
రోజులన్నీ ఒక్క మాదిరిగా వుండవు కదా.
కాపురంలో చిర్రుబుర్రులు మొదలయ్యాయి. సంభాషణల్లో అనురాగాల పాలు తగ్గి వాదాలు చోటుచేసుకోవడం ప్రారంభమయింది.
ఇద్దరి మధ్యా మాటలు తగ్గిపోయాయి. ఎప్పుడన్నా నోరు తెరిచినా అది చివరకు నోరు పారేసుకోవడం దాకా వెళ్ళేది.
తల్లిదగ్గర చెప్పుకుంది.
‘ఇతగాడిని భరించడం ఇక నా వల్లకాదు. నేను విడాకులు తీసుకుంటాను మమ్మీ. అతడు
కూడా వొప్పుకున్నాడు. ఇష్టం లేని కాపురం కన్నా విడిపోయి విడిగా వుండడమే
హాయి’
విన్న తల్లి గుండె గతుక్కుమంది. అయినా తమాయించుకుని చెప్పింది.
‘నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా కాదన్నానా చెప్పు. అలాగే విడాకులు తీసుకుందురు
కాని. కానీ నీ పెళ్ళిలో నీకొక బ్యాంక్ పాస్ బుక్ ఇచ్చాను కదా. అందులో యెంత
వేసారో ఏమిటో. ముందు ఆ డబ్బు బయటకు తీసి ఒక్క పైసా మిగలకుండా అంతా
ఖర్చుచేసేయ్యి. ఎందుకంటే ఈ దాంపత్యం తాలూకు ఏవీ నీకు గుర్తులుగా మిగిలి
వుండకూడదు.’
అమ్మాయి పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళింది. క్యూలో
నిలబడివున్నప్పుడు అనుకోకుండా పుస్తకం తెరిచి చూసింది. అందులో డిపాజిట్
చేసింది తక్కువసార్లే అయినా ఆ ఎంట్రీల వద్ద రాసిపెట్టిన జ్ఞాపకాలు ఆమెను
కదిలించాయి. పిల్లవాడు పుట్టడం, జీతాలు పెరగడం, ప్రమోషన్ రావడం – ఆ
సందర్భాల్లో తమ నడుమ చోటుచేసుకున్న ఆహ్లాదకర క్షణాలు – ఓహ్ – జీవితమంటే
యెంత ఆనందం.
ఇక అక్కడ నిలబడలేక ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చి భర్తతో
చెప్పింది. 'ఇదిగో. ఈ పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళు. ఎంతవుంటే అంత
తీసేసుకుని అంతా ఖర్చు చేసెయ్యి. ఆ తరవాతే ఇంటికి రా’
మర్నాడు వచ్చాడు. వచ్చి భార్య చేతిలో పాస్ బుక్ పెట్టాడు. అందులో కొత్త డిపాజిట్ వుంది. దానికి కింద ఇలా రాసాడు.
‘ఈ రోజు నా జీవితంలో గొప్పరోజు. నిన్ను నేను ఎంతగా ప్రేమించిందీ, ఇన్నేళ్ళ
దాపత్యంలో నువ్వు నాకెంత సంతోషాన్ని అందించిందీ అన్నీ ఈ రోజే మళ్ళీ
కొత్తగా తెలుసుకున్నాను.’
ఎవరు ముందో తెలియనంత వేగంగా వారిద్దరూ ఒకరినొకరు దగ్గరకు తీసుకున్నారు. ఆనంద భాష్పాలతో వారి కాపురం పునీతమైంది.
తరువాత వారు చేసిన మొట్టమొదటి పని – బ్యాంకు పాస్ బుక్ ను భద్రంగా బీరువాలో దాచిపెట్టడం.
Wednesday, March 26, 2014
Monday, March 24, 2014
అమ్మ ప్రేమ అద్భుతం వేల కట్ట లేనిది
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె
ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు
నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్
కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని
స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు.
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను.
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను.
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.
ప్రియమైన కుమారునికి,
ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.
ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు.
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను.
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను.
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.
ప్రియమైన కుమారునికి,
ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.
ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?
Tuesday, March 18, 2014
ధర్మసూక్ష్మాలు
మంచి నీతి కథ...
ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు. పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు. కొందరు " ఆ గొల్లవనితది" తప్పన్నారు. కొందరు పాముది తప్పుఅని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పుఅని వాదించటం ఆరంభించారు. ఈ వాదప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి. చిత్రగుప్తుడు, "ప్రభూ! పాపం ఎవరికి చెందుతుంది" అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. దానికా సమవర్తి "చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి? ఎమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు" అని తీర్పునిచ్చాడు. కాబట్టి మనము ధర్మసుక్ష్మాలు తెలియకుండా వారిది తప్పు , వీరిది తప్పు అని నిర్ణయము చేస్తే, పాపము లో భాగము మనకు పంచుతారు. తస్మాత్ జాగ్రత్త!
ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు. పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు. కొందరు " ఆ గొల్లవనితది" తప్పన్నారు. కొందరు పాముది తప్పుఅని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పుఅని వాదించటం ఆరంభించారు. ఈ వాదప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి. చిత్రగుప్తుడు, "ప్రభూ! పాపం ఎవరికి చెందుతుంది" అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. దానికా సమవర్తి "చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి? ఎమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు" అని తీర్పునిచ్చాడు. కాబట్టి మనము ధర్మసుక్ష్మాలు తెలియకుండా వారిది తప్పు , వీరిది తప్పు అని నిర్ణయము చేస్తే, పాపము లో భాగము మనకు పంచుతారు. తస్మాత్ జాగ్రత్త!
Thursday, March 13, 2014
మూడు ఖర్చులు:
మంచి కరువు కాలాన ఒక పెద్దమనిషి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణం
పెట్టుకున్నాడు. కరువు రోజుల్లో చుట్టుపక్కలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా.
ఎండిపోయిన పైర్లు, పగుళ్లిచ్చిన నేలలు, నీళ్లింకిపోయిన చెరువులు.
అల్లాడుతున్న జనం. ఆహా కలికాలం వచ్చేసిందిగదా అని అదంతా చూసుకుంటూ
వస్తున్నాడంట పెద్దమనిషి.
కొంత దూరం వచ్చాక ఆయనకు ఒక పొలం కనిపించింది. అది ఏపుగా ఉంది. పచ్చగా ఉంది. కళకళలాడుతూ ఉంది. దానిని చూసి ఆశ్చర్యపోయాడు పెద్దమనిషి. ఇంతలో బడబడమని ఒక నల్లటి మబ్బు కదిలివచ్చి ఆ పొలం ఎంతవరకు ఉందో అంత వరకే వచ్చి నిలబడింది. ఆ తర్వాత ఆ పైరుకు ఎంత వానకావాలో అంత వానా కురిపించి వెళ్లిపోయింది.
పెద్దమనిషికి మతిపోయింది.
యిదంతా పట్టించుకోకుండా పొలంలో దిగి పనులు చేసుకుంటున్న ఆ పొలం రైతు దగ్గరకు వెళ్లి “ఏమయ్యా! నేను యింత దూరం నుంచి వస్తున్నాను. ఎక్కడా పచ్చి గరిక మొలవలెదు. నీ పైరేమో విరగపండుతోంది. నీ పైనే వాన కురుస్తూ ఉంది. ఏమి ఈ మాయ?” అని అడిగాడు.
“ఏమో స్వామి. నాకేమి తెలుసు. నేను వ్యవసాయం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరికి వానలు కురిసినా కురవకపోయినా నా చేనుకి వాన కురుస్తూనే ఉంది. ఎవరికి పండినా పండకపోయినా నా చేను పండుతూనే ఉంది” అన్నాడు రైతు.
“కాదు. యిందులో ఏదో పరమార్థం ఉంటుంది. నీ జమా ఖర్చుల సంగతి చెప్పు” అన్నాడు పెద్దమనిషి.
“ఏమిలేదు స్వామి. పంట పండించాక వచ్చిన సొమ్ముని నేను మూడు ఖర్చులుగా విడగొడతాను. ఒక ఖర్చు నా ఇంటికీ సంసారానికీ ఉంచుకుంటాను. ఒక ఖర్చుని పంటకీ విత్తనాలకీ పాడికీ పశువుకీ ఉంచుకుంటాను. మూడో ఖర్చుని పేదలికీ సాదలకీ పంచి పెడతాను” అన్నాడు రైతు.
“అదీ అలా చెప్పు. ఇంక నీకు కురవకపోతే ఇంకెవరికి కురుస్తుందయ్యా వాన” అని వెళ్లిపోయాడు ఆ పెద్దమనిషి.
కొంత దూరం వచ్చాక ఆయనకు ఒక పొలం కనిపించింది. అది ఏపుగా ఉంది. పచ్చగా ఉంది. కళకళలాడుతూ ఉంది. దానిని చూసి ఆశ్చర్యపోయాడు పెద్దమనిషి. ఇంతలో బడబడమని ఒక నల్లటి మబ్బు కదిలివచ్చి ఆ పొలం ఎంతవరకు ఉందో అంత వరకే వచ్చి నిలబడింది. ఆ తర్వాత ఆ పైరుకు ఎంత వానకావాలో అంత వానా కురిపించి వెళ్లిపోయింది.
పెద్దమనిషికి మతిపోయింది.
యిదంతా పట్టించుకోకుండా పొలంలో దిగి పనులు చేసుకుంటున్న ఆ పొలం రైతు దగ్గరకు వెళ్లి “ఏమయ్యా! నేను యింత దూరం నుంచి వస్తున్నాను. ఎక్కడా పచ్చి గరిక మొలవలెదు. నీ పైరేమో విరగపండుతోంది. నీ పైనే వాన కురుస్తూ ఉంది. ఏమి ఈ మాయ?” అని అడిగాడు.
“ఏమో స్వామి. నాకేమి తెలుసు. నేను వ్యవసాయం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరికి వానలు కురిసినా కురవకపోయినా నా చేనుకి వాన కురుస్తూనే ఉంది. ఎవరికి పండినా పండకపోయినా నా చేను పండుతూనే ఉంది” అన్నాడు రైతు.
“కాదు. యిందులో ఏదో పరమార్థం ఉంటుంది. నీ జమా ఖర్చుల సంగతి చెప్పు” అన్నాడు పెద్దమనిషి.
“ఏమిలేదు స్వామి. పంట పండించాక వచ్చిన సొమ్ముని నేను మూడు ఖర్చులుగా విడగొడతాను. ఒక ఖర్చు నా ఇంటికీ సంసారానికీ ఉంచుకుంటాను. ఒక ఖర్చుని పంటకీ విత్తనాలకీ పాడికీ పశువుకీ ఉంచుకుంటాను. మూడో ఖర్చుని పేదలికీ సాదలకీ పంచి పెడతాను” అన్నాడు రైతు.
“అదీ అలా చెప్పు. ఇంక నీకు కురవకపోతే ఇంకెవరికి కురుస్తుందయ్యా వాన” అని వెళ్లిపోయాడు ఆ పెద్దమనిషి.
దయామయుడు
భక్తి, నమ్మకం
కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూర్ కృష్ణ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడికి నిత్యం వేలమంది భక్తులు వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ఒక భక్తుడు కాలునెప్పితో బాధపడుతూ ఉండేవాడు. 41 రోజుల పాటు నిత్యం గుడిదగ్గర స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ 41 రోజులు పూర్తి అయ్యేసరికి కాలునెప్పి తగ్గించమని కృష్ణుణ్ణి వేడుకోసాగేడు. అతను డబ్బున్నవాడు కావడంతో , రోజు అతన్ని గుడికి తీసుకురావడానికి పనివాళ్ళని పెట్టుకున్నాడు. అలా శ్రద్ధగా 40 రోజులు పుర్తిచేసాడు. అయినా కాలునెప్పి తగ్గకపొవడంతో నిరాశపడసాగేడు.
గురువాయూర్ లోనే ఉన్న వేరొక భక్తుడు తన కుమార్తె పెళ్ళి కోసం కృష్ణ్ణుణ్ణి ప్రార్ధిస్తున్నాడు. పెళ్ళి కుదిరి నిశ్చితార్ధం జరిగింది. అతను బాగా పేదవాడు కావడంతో పెళ్ళికి కావలసిన డబ్బు, నగలు సమకూర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒకరోజు రాత్రి కృష్ణుడు ఈ భక్తుని కలలోకి వచ్చి, రేపు పొద్దున్న గుడిదగ్గర చెరువుగట్టు మీద ఒకసంచి ఉంటుంది. అది తీసుకుని వెనక్కి తిరిగిచూడకుడా ఇంటికి వెళ్ళీపో అని చెప్పేడు.
కాలునెప్పి తగ్గించమని ప్రార్థిస్తున్న భక్తుడు , 41వ రోజు కృష్ణుడుకి కానుకగా ఇవ్వాలని ఒక సంచిలో బంగారునాణేలు పట్టుకుని గుడికివచ్చేడు. ఆ సంచి చెరువు గట్టుమీద పెట్టి స్నానానికి వెళ్ళేడు. ఇంతలో కృష్ణుడు చెప్పినట్లుగా పేదభక్తుడు చెరువు దగ్గరికి వచ్చి సంచి తీసు కుని వెనక్కి తిరిగిచూడకుండా పరిగెత్తసాగేడు. స్నానం చేస్తున్న భక్తుడు అది గమనించి తన సంచి ఎవరో దొంగ ఎత్తుకుపోతున్నాడని భావించి అతని వెనకాల పరిగెత్తేడు , కాని పట్టుకోలేకపోయేడు. తన దురదృష్టానికి బాధపడుతూ వెనక్కి వస్తూండగా ఒక్కసారిగా నడవగలుగుతున్న విషయం గమనించాడు. కాలునెప్పి తగ్గిపొవడమే కాకుండా ఇంతసేపు సంచి కోసం పరిగెత్తగలిగేనని తెలుసుకుని చాలా సంతోషించేడు.
ఈ విధంగా శ్రీ కృష్ణభగవానుడు ఇద్దరు భక్తుల కోరికలు సమయానుకులంగా తీర్చి సంతోషాన్ని అందించాడు.
నీతి: భగవంతుడు దయామయుడు. హృదయపూర్వకంగా చేసే ప్రార్థనకి తప్పకుండా స్పందిస్తాడు. ఆయనకి భక్తులందరు సమానమే, అయితే వాళ్ళ పరిస్థితిని బట్టి,సమయానుకూలంగా వాళ్ళని సంతోషపెట్టడం ఆయన ప్రత్యేకత. ఆయన అనుగ్రహించే పద్ధతులు వేరుగా ఉన్నా, అందరిపట్లా ఆయన ప్రేమ సమానంగా ఉంటుంది.
కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూర్ కృష్ణ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడికి నిత్యం వేలమంది భక్తులు వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ఒక భక్తుడు కాలునెప్పితో బాధపడుతూ ఉండేవాడు. 41 రోజుల పాటు నిత్యం గుడిదగ్గర స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ 41 రోజులు పూర్తి అయ్యేసరికి కాలునెప్పి తగ్గించమని కృష్ణుణ్ణి వేడుకోసాగేడు. అతను డబ్బున్నవాడు కావడంతో , రోజు అతన్ని గుడికి తీసుకురావడానికి పనివాళ్ళని పెట్టుకున్నాడు. అలా శ్రద్ధగా 40 రోజులు పుర్తిచేసాడు. అయినా కాలునెప్పి తగ్గకపొవడంతో నిరాశపడసాగేడు.
గురువాయూర్ లోనే ఉన్న వేరొక భక్తుడు తన కుమార్తె పెళ్ళి కోసం కృష్ణ్ణుణ్ణి ప్రార్ధిస్తున్నాడు. పెళ్ళి కుదిరి నిశ్చితార్ధం జరిగింది. అతను బాగా పేదవాడు కావడంతో పెళ్ళికి కావలసిన డబ్బు, నగలు సమకూర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒకరోజు రాత్రి కృష్ణుడు ఈ భక్తుని కలలోకి వచ్చి, రేపు పొద్దున్న గుడిదగ్గర చెరువుగట్టు మీద ఒకసంచి ఉంటుంది. అది తీసుకుని వెనక్కి తిరిగిచూడకుడా ఇంటికి వెళ్ళీపో అని చెప్పేడు.
కాలునెప్పి తగ్గించమని ప్రార్థిస్తున్న భక్తుడు , 41వ రోజు కృష్ణుడుకి కానుకగా ఇవ్వాలని ఒక సంచిలో బంగారునాణేలు పట్టుకుని గుడికివచ్చేడు. ఆ సంచి చెరువు గట్టుమీద పెట్టి స్నానానికి వెళ్ళేడు. ఇంతలో కృష్ణుడు చెప్పినట్లుగా పేదభక్తుడు చెరువు దగ్గరికి వచ్చి సంచి తీసు కుని వెనక్కి తిరిగిచూడకుండా పరిగెత్తసాగేడు. స్నానం చేస్తున్న భక్తుడు అది గమనించి తన సంచి ఎవరో దొంగ ఎత్తుకుపోతున్నాడని భావించి అతని వెనకాల పరిగెత్తేడు , కాని పట్టుకోలేకపోయేడు. తన దురదృష్టానికి బాధపడుతూ వెనక్కి వస్తూండగా ఒక్కసారిగా నడవగలుగుతున్న విషయం గమనించాడు. కాలునెప్పి తగ్గిపొవడమే కాకుండా ఇంతసేపు సంచి కోసం పరిగెత్తగలిగేనని తెలుసుకుని చాలా సంతోషించేడు.
ఈ విధంగా శ్రీ కృష్ణభగవానుడు ఇద్దరు భక్తుల కోరికలు సమయానుకులంగా తీర్చి సంతోషాన్ని అందించాడు.
నీతి: భగవంతుడు దయామయుడు. హృదయపూర్వకంగా చేసే ప్రార్థనకి తప్పకుండా స్పందిస్తాడు. ఆయనకి భక్తులందరు సమానమే, అయితే వాళ్ళ పరిస్థితిని బట్టి,సమయానుకూలంగా వాళ్ళని సంతోషపెట్టడం ఆయన ప్రత్యేకత. ఆయన అనుగ్రహించే పద్ధతులు వేరుగా ఉన్నా, అందరిపట్లా ఆయన ప్రేమ సమానంగా ఉంటుంది.
Saturday, March 8, 2014
జీవిత సత్యం
ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ, ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో
జీవించేవారు. ఒక రోజు ఆమె వంట చేస్తుండగా, మనవడు ఆమె దగ్గరికొచ్చాడు.
"నానమ్మ! ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బావుండట్లేదు, తలనొప్పి, కడుపు నొప్పి,
జ్వరం అన్నీ ముకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్లో కుడా నాకు మార్కులు
తక్కువుగా వస్తున్నాయి, ఉపాధ్యాయులు తిడుతున్నారు, స్నేహితులు నాతో సరిగా
మాట్లాడట్లేదు" అని తన బాధలన్నింటినీ ఏకరువు పెట్టసాగాడు.
నానమ్మ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, "చూడు నాన్నా! నువ్వు ఈ ఉడకని, వండని బియ్యాన్ని అలాగే తినగలవా?" అని అడిగింది. "ఛీ. అస్సలు తినలేను" అన్నాడు మనవడు. "మరి కేవలం నీళ్ళు త్రాగి జీవించగలవా?" అని నానమ్మ అడగ్గా "లేదు" అని జవాబిచ్చాడు మనవడు. "కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా? మళ్ళీ అడిగింది నానమ్మ. "అమ్మో! నావల్ల కాదు" చెప్పాడు మనవడు. "మరి ఉప్పు" అని అడిగిన నానమ్మను "లేదు నానమ్మ. కాని ఇవన్నీ ఎందుకడుగుతున్నావు?" అని ఎదురు ప్రశ్నించాడు మనవడు.
"బాబూ! బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం. ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా! అదే విధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం.... ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితమవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి, ఏమి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు.
మనం మన జీవిత స్ధితి గతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి.
ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి.
మనకు ఇలాగే మంచి రోజులూ ఉంటాయి, చెడు రోజులూ ఉంటాయి"
నానమ్మ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, "చూడు నాన్నా! నువ్వు ఈ ఉడకని, వండని బియ్యాన్ని అలాగే తినగలవా?" అని అడిగింది. "ఛీ. అస్సలు తినలేను" అన్నాడు మనవడు. "మరి కేవలం నీళ్ళు త్రాగి జీవించగలవా?" అని నానమ్మ అడగ్గా "లేదు" అని జవాబిచ్చాడు మనవడు. "కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా? మళ్ళీ అడిగింది నానమ్మ. "అమ్మో! నావల్ల కాదు" చెప్పాడు మనవడు. "మరి ఉప్పు" అని అడిగిన నానమ్మను "లేదు నానమ్మ. కాని ఇవన్నీ ఎందుకడుగుతున్నావు?" అని ఎదురు ప్రశ్నించాడు మనవడు.
"బాబూ! బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం. ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా! అదే విధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం.... ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితమవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి, ఏమి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు.
మనం మన జీవిత స్ధితి గతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి.
ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి.
మనకు ఇలాగే మంచి రోజులూ ఉంటాయి, చెడు రోజులూ ఉంటాయి"
" సంతృప్తి "
అనగా
అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా
రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి
జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల
వచ్చింది.
ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కానీ దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ కండీషను కూడా పెట్టినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతుంది.
రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.
రాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకా కూజ ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రి వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పాడు.
మనిషికి " సంతృప్తి "అనేది ముఖ్యము, లేకుంటే అసంతృప్తితో ఉన్నదంతా పోగొట్టుకోవాల్సి ఉంటుంది
ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కానీ దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ కండీషను కూడా పెట్టినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలూ చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతుంది.
రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది ధగ ధగ మెరుస్తూ ఏడు పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్చ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు కానీ కూజా నిండుగా కాలేదు! ఇంకా సగం ఖాళీగానే ఉన్నది.
రాజ్యం వెళ్ళి ఒక్క రోజు ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాదు కానీ ఇంకా కూజ ఖాళీగానే ఉన్నది. ఒక సంవత్సరం ఆదాయం వేసాడు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కానీ తెలివి గల మంత్రి వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా! ఈ ఏడవ కూజా ఉన్నది చూసినారా అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పాడు.
మనిషికి " సంతృప్తి "అనేది ముఖ్యము, లేకుంటే అసంతృప్తితో ఉన్నదంతా పోగొట్టుకోవాల్సి ఉంటుంది
"నోరు జారిన మాటలు"
చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ
అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా,
అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి
కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు
పట్టించుకునేది కాదు.
ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.
మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.
“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.
సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.
మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.
వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.
అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.
ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.
ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.
మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.
“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.
సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.
మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.
వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.
అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.
ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.
చిల్లు కుండ విలువ
ఒక
ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి
కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ
రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారు పోతుంటే, మరొకటి ఒక చుక్క
నీరు కూడా కారిపోకుండా ఉంది.
చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది.
"ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు. "ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని నసిగిందా పగుళ్ళ కుండ. దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు "బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.
పనివాడు ఆ కుండతో "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు" అన్నాడు. పగుళ్ళ కుండ తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది.
మనలో లోపాలున్నా పగుళ్ళకుండ మదిరిగానే మనమూ ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే గాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్నీ ఆనందంగా ఉండేలా చేసుకోగలం.4
చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది.
"ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు. "ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని నసిగిందా పగుళ్ళ కుండ. దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు "బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.
పనివాడు ఆ కుండతో "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు" అన్నాడు. పగుళ్ళ కుండ తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది.
మనలో లోపాలున్నా పగుళ్ళకుండ మదిరిగానే మనమూ ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే గాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్నీ ఆనందంగా ఉండేలా చేసుకోగలం.4
"నోరు జారిన మాటలు"
చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ
అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా,
అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి
కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు
పట్టించుకునేది కాదు.
ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.
మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.
“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.
సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.
మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.
వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.
అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.
ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.
ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.
మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.
“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.
సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.
మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.
వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.
అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.
ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.
నిజ జీవితంలో సక్సెస్ఫుల్ పెర్సన్.
ఈ స్టోరీ టాలెంట్ కు సంబందించినది..
కట్టెలు కొట్టే ఒక బీధ వ్యక్తి ఉజ్జోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరకు వెల్తాడు.. తనకు ఎదయినా పని ఇప్పించమని రిక్వెస్ట్ చేసాడు..
ఆ కట్టెలు కొట్టే వాడిని చూసిన పెద్దాయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.. కారణం కండలు తిరిగిన శరీరం అంతకు మించి పని మీద శ్రద్ద పని చేసి సంపాదించాలనే తపన...
పని ఇవ్వాలని నిర్దారనకు వచ్చి ఒక అడవి వద్దకు తీసుకుని వెళ్ళి.. ' ఇది మనం లీజుకు తీసుకున్న భాగం.. నీకు సాధ్యమయినన్ని కట్టెలు కొట్టి.. సాయంకాలనికి నాకు లెక్క చెప్పాలి.. ' అని పనిని అప్పగించి అక్కడనుంచి వెళ్ళి పోతాడు..
కట్టెలు కొట్టే వ్యక్తి తన పనిని మొదలు పెత్తి.. మొదటి రోజు 10 ఎద్దుల బడెలు నిండేలా కట్టెలు రెడి చేసి ఓనర్ కు లెక్క చెప్తాడు..
మొదటి రోజు తన పనిని చూసిన పెద్దాయన చాలా సంతోషించి.. తన పనిని గొప్పగా పొగుడుతాడు..
అలాగే రెండవ రోజు కూడా కట్టెలు కొట్టే వ్యక్తి 9 ఎడ్ల బండ్లు నిండేలా కట్టేలు కొడతాడు...
సాయంకాలం ఓనర్ కు లెక్క చెప్తాడు...
అలా అయిదు రోజులు గడిచే సరికి 6 ఏడ్ల బండ్లు నిండేలా మత్రమే కట్టెలు కొడతాడు..
రోజు రోజుకు పని సామర్ద్యం తగ్గిపోతుందే అని బాద పండిన కట్టెలు కొట్టే వ్యక్తి తన యజమానితో జరుగుతున్న విషయం మొత్తం షేర్ చేసుకుంటాడు...
'అయ్యా నేను రోజు మొత్తం క్షణం అయినా సేద తీరకుండ ప్రయత్నించినా మొదటి రోజు చేసినంత పనిని చేరుకోలేక పోతున్నాను.. అని తన బాదను విన్నవించుకుంటాడు...
అంతా వినిన యజమాని.. ' చూడు బాబు.. నీ ప్రయత్న లోపం ఎమి లేదు.. నేను నిన్ను నమ్ముతాను.. నీలో చేయాలన్న తపన ఉంది.. చేయగలిగిన శక్తి ఉంది... కాని... నీవు ఛేస్తున్న తప్పంటే నీకు తెలియరావడం లేదు...' అని సమాధానం ఇస్తాడు...
నేనేమి తప్పు చేసాను అని పని వాడు అడుగుతాడు..
అందుకు యజమాని... ఎప్పుడయినా నీవు కట్టెలు కొట్టే నీ గొడ్డలిని పదును పెట్టావా..?? అని అడుగుతాడు...
అందుకు పని వాడు లేదనే సమాదానం చేప్తాడు...
యజమాని చిన్నగా నవ్వి... ' బాబు కట్టెలు కొట్టడం నీకు వచ్చిన కళ.. అందులో నీవు నిపునుడవు.. కాని.. నీ నైపున్యాణికి అంటే నీవు ఉపయోగించే గొడ్డలకి పదును పెడితే.. నిన్ను మించిన పని వాడు ఈ ప్రపంచలో ఇంకేవరు ఉండరు... అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు...'
తను చేస్తున్న తప్పును సరి దిద్దుకున్న పని వాడు.. తన గొడ్డలికి మరుసటి రోజు పదును పెట్టి ప్రయత్నించాడు.. తిరిగి తన పూర్వ స్థితిని చేరుకోవడమే కాదు... ఇంకా మెరుగయిన పనిని చేరుకున్నాడు...'
మనలో చాలా మందికి కూడా అంతులేని నైపుణ్యం చేయాలన్న తపన ఉంటుంది.. కాని వారి నైపుణ్యానికి మెరుగు పెట్టడం మరచి పోతుంటారు... అందుకు నిదర్శనమే ఈ చిన్న కధ...
టలెంట్ ఉంటే సరిపోదు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడే నిజ జీవితంలో సక్సెస్
కట్టెలు కొట్టే ఒక బీధ వ్యక్తి ఉజ్జోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరకు వెల్తాడు.. తనకు ఎదయినా పని ఇప్పించమని రిక్వెస్ట్ చేసాడు..
ఆ కట్టెలు కొట్టే వాడిని చూసిన పెద్దాయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.. కారణం కండలు తిరిగిన శరీరం అంతకు మించి పని మీద శ్రద్ద పని చేసి సంపాదించాలనే తపన...
పని ఇవ్వాలని నిర్దారనకు వచ్చి ఒక అడవి వద్దకు తీసుకుని వెళ్ళి.. ' ఇది మనం లీజుకు తీసుకున్న భాగం.. నీకు సాధ్యమయినన్ని కట్టెలు కొట్టి.. సాయంకాలనికి నాకు లెక్క చెప్పాలి.. ' అని పనిని అప్పగించి అక్కడనుంచి వెళ్ళి పోతాడు..
కట్టెలు కొట్టే వ్యక్తి తన పనిని మొదలు పెత్తి.. మొదటి రోజు 10 ఎద్దుల బడెలు నిండేలా కట్టెలు రెడి చేసి ఓనర్ కు లెక్క చెప్తాడు..
మొదటి రోజు తన పనిని చూసిన పెద్దాయన చాలా సంతోషించి.. తన పనిని గొప్పగా పొగుడుతాడు..
అలాగే రెండవ రోజు కూడా కట్టెలు కొట్టే వ్యక్తి 9 ఎడ్ల బండ్లు నిండేలా కట్టేలు కొడతాడు...
సాయంకాలం ఓనర్ కు లెక్క చెప్తాడు...
అలా అయిదు రోజులు గడిచే సరికి 6 ఏడ్ల బండ్లు నిండేలా మత్రమే కట్టెలు కొడతాడు..
రోజు రోజుకు పని సామర్ద్యం తగ్గిపోతుందే అని బాద పండిన కట్టెలు కొట్టే వ్యక్తి తన యజమానితో జరుగుతున్న విషయం మొత్తం షేర్ చేసుకుంటాడు...
'అయ్యా నేను రోజు మొత్తం క్షణం అయినా సేద తీరకుండ ప్రయత్నించినా మొదటి రోజు చేసినంత పనిని చేరుకోలేక పోతున్నాను.. అని తన బాదను విన్నవించుకుంటాడు...
అంతా వినిన యజమాని.. ' చూడు బాబు.. నీ ప్రయత్న లోపం ఎమి లేదు.. నేను నిన్ను నమ్ముతాను.. నీలో చేయాలన్న తపన ఉంది.. చేయగలిగిన శక్తి ఉంది... కాని... నీవు ఛేస్తున్న తప్పంటే నీకు తెలియరావడం లేదు...' అని సమాధానం ఇస్తాడు...
నేనేమి తప్పు చేసాను అని పని వాడు అడుగుతాడు..
అందుకు యజమాని... ఎప్పుడయినా నీవు కట్టెలు కొట్టే నీ గొడ్డలిని పదును పెట్టావా..?? అని అడుగుతాడు...
అందుకు పని వాడు లేదనే సమాదానం చేప్తాడు...
యజమాని చిన్నగా నవ్వి... ' బాబు కట్టెలు కొట్టడం నీకు వచ్చిన కళ.. అందులో నీవు నిపునుడవు.. కాని.. నీ నైపున్యాణికి అంటే నీవు ఉపయోగించే గొడ్డలకి పదును పెడితే.. నిన్ను మించిన పని వాడు ఈ ప్రపంచలో ఇంకేవరు ఉండరు... అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు...'
తను చేస్తున్న తప్పును సరి దిద్దుకున్న పని వాడు.. తన గొడ్డలికి మరుసటి రోజు పదును పెట్టి ప్రయత్నించాడు.. తిరిగి తన పూర్వ స్థితిని చేరుకోవడమే కాదు... ఇంకా మెరుగయిన పనిని చేరుకున్నాడు...'
మనలో చాలా మందికి కూడా అంతులేని నైపుణ్యం చేయాలన్న తపన ఉంటుంది.. కాని వారి నైపుణ్యానికి మెరుగు పెట్టడం మరచి పోతుంటారు... అందుకు నిదర్శనమే ఈ చిన్న కధ...
టలెంట్ ఉంటే సరిపోదు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడే నిజ జీవితంలో సక్సెస్
అలెగ్జాండర్ నుండి పాఠాలు
అలెగ్జాండర్ నుండి పాఠాలు
అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు..
మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.
తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని
సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది. ఇంటికి వెళ్ళాలనే
కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి కన్ను
మూయాలనే ఆశ.
కానీ సమయం గడిసే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు.
నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను
దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.. “నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి
నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి
పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి
వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రునయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.
నా మొదటి కోరిక: ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”
చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది.
అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా వచ్చి, ఆయన
చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ
కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.
అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు.. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”
“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు... ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.
“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే
సరిపోయింది.. అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల
వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”
“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో
వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ” అని
చెప్పి కన్ను మూశాడు.
అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల చక్రవర్తే కావచ్చు. కానీ ఆయన గురించిన ఈ
సంఘటనలో భారతీయ ఆత్మ ఉంది. ఆధ్యాత్మిక సారం ఉంది. అందుకనే ఈ సంఘటన అంటే
నాకు ఎంతో ఇష్టం..
Friday, March 7, 2014
భగవదనుగ్రహం
ఒక ఊరిలో పూజారి ఉండేవారు. అతను తప్పనిసరి పనిమీద ఊరు వెళ్ళవలసివచ్చింది.ఆ
ఊరిలో పూజ చేసేవాళ్ళు ఇంకెవరూ లేకపొవడంతో ఆ బాధ్యతని, పన్నెండేళ్ళ వయసున్న
తన కొడుకు ఉన్నికి అప్పచెప్పి వెళ్ళేరు. దేవుడికి నైవేద్యం పెట్టడానికి
అన్నం తీసుకుని ఉన్ని గుడికి వెళ్ళేడు.దేవుడు నిజంగా వచ్చి తింటాడు అనుకుని
ఎదురుచూస్తున్నాడు. విగ్రహం కదలకపోవడంతో అన్నం నచ్చలేదేమో అని బైటికి
వెళ్ళి మామిడి పళ్ళు , పెరుగు కొని
తెచ్చాడు.తినమని బ్రతిమాలాడు, బెదిరించాడు, ఎన్ని చేసినా దేవుడు కదలలేదు.
తండ్రి ఊరినుండి వచ్చాక దేవుడు అన్నం తినలేదని తెలిస్తే తనని కొడతాడని
భయపడి పెద్దగా ఏడవసాగేడు. అది చూసిన దేవుడి మనసు కరిగి నిజంగా నైవేద్యం
స్వీకరించాడు.గిన్నెలు ఖాళీ అవ్వడంతో దేవుడు తిన్నాడని ఉన్ని సంతోషంగా
ఇంటికి వెళ్ళేడు. ఊరినుండి వచ్చిన పూజారి గిన్నెలు ఖాళీగా ఉండడం చూసి
ఉన్నిని ప్రశ్నించాడు. దేవుడు అన్నం తిన్నాడని ఉన్ని సంతోషంగా చెప్పేడు.
పుజారి , ఉన్ని అబద్ధం చెప్తున్నాడని భావించి కోపంతో కొట్టబోయాడు. ఇంతలో ఒక
అశరీరవాణి ఈ విధంగా పలికింది ” ఉన్ని అమాయకుడు, నేను అన్నం తిన్నాను”. అది
విన్న అవి పూజారి దేవుడి మాటలు అని గ్రహించి సంతోషించాడు. ఉన్నిని
కాపాడడానికి స్వయంగా భగవంతుడే వచ్చాడు
.నీతి: ప్రేమ అనే బంధం భక్తులని భగవంతుడుతో కట్టి ఉంచుతుంది.భగవంతుడు భక్తుల ప్రేమకి వశపడి ఉంటాడు. భక్తులని రక్షించడానికి ఏమి చెయ్యడానికి అయినా సిద్ధపడతాడు.
.నీతి: ప్రేమ అనే బంధం భక్తులని భగవంతుడుతో కట్టి ఉంచుతుంది.భగవంతుడు భక్తుల ప్రేమకి వశపడి ఉంటాడు. భక్తులని రక్షించడానికి ఏమి చెయ్యడానికి అయినా సిద్ధపడతాడు.
కష్టకాలంలో కూడా.. "బ్రతికేయొచ్చు.."
60 సంవత్సరాల నిరుపేద వృద్దుడు. పెద్ద వయస్సులో కష్టపడలేక - జైలులో ఉన్న తన కొడుకుకు ఒక లేఖ వ్రాసాడు.
" నాన్నా..! నువ్వు నిరాధార కేసులో ఇరుక్కుని జైలులో ఉన్నావు. ఇక్కడ నా పరిస్దితి ఏం బాగోలేదు. ఒళ్ళు కూడా సహకరించడం లేదు. మన తోటలో కూరగాయలు సాగు చేద్దాం అంటే.. పొలం భూమి చాలా గట్టిగా ఉంది రా.! మనుష్యులని పెట్టి సాగు చేయిద్దాం అన్నా - చేతిలో అంత డబ్బు లేదు. నాకు సహాయంగా ఉండే నువ్వు కూడా జైలులో ఉండి పోయావు. నాకు సహాయం చేసే వారు లేరు. చాలా బాధల్లో ఉన్నాను. త్వరగా వస్తే బాగుంటుంది. " ఇది ఆ లేఖ సారాంశం.
ఆ లేఖను తన కొడుకుకి క్షమాబిక్ష ఇవ్వడం కోసం రాష్ట్రపతికి పంపాడు.. అలాగే కొడుకుకి కూడా..
కొద్దిరోజులకు ఆ వృద్ధుడు తన కొడుకు దగ్గర నుంచి లేఖ అందుకున్నాడు.. అందులో " నాన్నగారు మీరు ఆ పొలం తవ్వోద్దు.. ఎందుకంటే - నేను హత్యకేసులో ఇరుక్కున్న శవాలు ఆ భూమిలోనే ఉన్నాయి. నేను త్వరలోనే వచ్చేస్తా..! వచ్చాక ఆ పని చూస్తా.." అని ఉంది.
అది చదివిన ముసలాయనకి ఏమీ అర్దం కాలేదు.
పక్కరోజు ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇళ్ళంతా సోదాలు చేసి.. ఆ లేఖని చూసి - అనక ఆ పొలం అంతా తవ్వి తవ్వి అలసిపోయి, ఎటువంటి ఆధారం దొరకక పొయేసరికి, " వీ ఆర్ రియల్లీ సారీ.." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
అదే రోజు తన కొడుకు దగ్గర నుంచి ఇంకొక లేఖ అందుకున్నాడు ముసలాయన. అందులో " నాన్నా పొలంలో ఇప్పుడు - నువ్వు ఏం కావాలంటే అవి వేసుకో.. నేను లేని లోటు పోలీస్ వాళ్ళు తీర్చారు.. అరోగ్యం జాగ్రత్త నాన్నా.."
అలా మన పోలీస్ వాళ్ళ సహాయంతో ఆ పెద్దాయన హ్యపీగా పొలం పండించుకున్నాడు..
నీతి : విన్నవన్నీ నిజాలు కాదు.. చూసేవన్ని సత్యాలు కావు.. తెలివనేది బుర్రలోనే ఉంటే.. కష్టకాలంలో కూడా.. "బ్రతికేయొచ్చు.." "బ్రతికించొచ్చు.."
టేక్ కేర్.. ఫ్రెండ్స్..
" నాన్నా..! నువ్వు నిరాధార కేసులో ఇరుక్కుని జైలులో ఉన్నావు. ఇక్కడ నా పరిస్దితి ఏం బాగోలేదు. ఒళ్ళు కూడా సహకరించడం లేదు. మన తోటలో కూరగాయలు సాగు చేద్దాం అంటే.. పొలం భూమి చాలా గట్టిగా ఉంది రా.! మనుష్యులని పెట్టి సాగు చేయిద్దాం అన్నా - చేతిలో అంత డబ్బు లేదు. నాకు సహాయంగా ఉండే నువ్వు కూడా జైలులో ఉండి పోయావు. నాకు సహాయం చేసే వారు లేరు. చాలా బాధల్లో ఉన్నాను. త్వరగా వస్తే బాగుంటుంది. " ఇది ఆ లేఖ సారాంశం.
ఆ లేఖను తన కొడుకుకి క్షమాబిక్ష ఇవ్వడం కోసం రాష్ట్రపతికి పంపాడు.. అలాగే కొడుకుకి కూడా..
కొద్దిరోజులకు ఆ వృద్ధుడు తన కొడుకు దగ్గర నుంచి లేఖ అందుకున్నాడు.. అందులో " నాన్నగారు మీరు ఆ పొలం తవ్వోద్దు.. ఎందుకంటే - నేను హత్యకేసులో ఇరుక్కున్న శవాలు ఆ భూమిలోనే ఉన్నాయి. నేను త్వరలోనే వచ్చేస్తా..! వచ్చాక ఆ పని చూస్తా.." అని ఉంది.
అది చదివిన ముసలాయనకి ఏమీ అర్దం కాలేదు.
పక్కరోజు ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇళ్ళంతా సోదాలు చేసి.. ఆ లేఖని చూసి - అనక ఆ పొలం అంతా తవ్వి తవ్వి అలసిపోయి, ఎటువంటి ఆధారం దొరకక పొయేసరికి, " వీ ఆర్ రియల్లీ సారీ.." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
అదే రోజు తన కొడుకు దగ్గర నుంచి ఇంకొక లేఖ అందుకున్నాడు ముసలాయన. అందులో " నాన్నా పొలంలో ఇప్పుడు - నువ్వు ఏం కావాలంటే అవి వేసుకో.. నేను లేని లోటు పోలీస్ వాళ్ళు తీర్చారు.. అరోగ్యం జాగ్రత్త నాన్నా.."
అలా మన పోలీస్ వాళ్ళ సహాయంతో ఆ పెద్దాయన హ్యపీగా పొలం పండించుకున్నాడు..
నీతి : విన్నవన్నీ నిజాలు కాదు.. చూసేవన్ని సత్యాలు కావు.. తెలివనేది బుర్రలోనే ఉంటే.. కష్టకాలంలో కూడా.. "బ్రతికేయొచ్చు.." "బ్రతికించొచ్చు.."
టేక్ కేర్.. ఫ్రెండ్స్..
దేవుడు
ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు.
దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి
ముందు కూర్చో. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే
అరువు. నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని
ఇస్తాను.
కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని
ఏళ్ళు అరవలెను. కాబట్టి ఇదుగో 10
ఏళ్ళు నీకు ఇచెస్తను. 10 ఏళ్ళు మాత్రమే
అరుస్తాను సరేనా !
దేవుడు: సరే..
ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని
తయారు చేసాడు.
దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష
పరుచు. నీకు 20
ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను.
కోతి: ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క
తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా నేను అలాగే
ఇస్తాను.
దేవుడు: సరే…
మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని
తయారు చేసాడు.
దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి
రోజంతా ఎండలో కస్టపడి
సాయత్రం పాలు ఇస్తూ రైతుకి సహాయం చేయి.
నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.
ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.
నాకు కూడా 20 ఏళ్ళు ఇచి మిగతా 40
ఏళ్ళు నువ్వే తీసుకో…
దేవుడు: సరే…
తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.
దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ
జీవితాన్ని ఆనందించు.. నేను నీఎకు 20
ఏళ్ళు ఆయుషు ని ఇస్తునాను.
మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20
ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి
మరియు కుక్కకి ఇచిన 10,10 మొత్తం 80 కావాలి…
దేవుడు: సరే…
అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు,
నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు,
ఆనందిస్తున్నాడు.. తరవాత 40
ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి
సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు ఆ
తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన
మనవల్లు మనవరల్లని నవ్విస్తున్నాడు.. తరవాత
10 ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని
అరుస్తుంటాడు….!!
దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి
ముందు కూర్చో. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే
అరువు. నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని
ఇస్తాను.
కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని
ఏళ్ళు అరవలెను. కాబట్టి ఇదుగో 10
ఏళ్ళు నీకు ఇచెస్తను. 10 ఏళ్ళు మాత్రమే
అరుస్తాను సరేనా !
దేవుడు: సరే..
ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని
తయారు చేసాడు.
దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష
పరుచు. నీకు 20
ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను.
కోతి: ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క
తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా నేను అలాగే
ఇస్తాను.
దేవుడు: సరే…
మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని
తయారు చేసాడు.
దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి
రోజంతా ఎండలో కస్టపడి
సాయత్రం పాలు ఇస్తూ రైతుకి సహాయం చేయి.
నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.
ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.
నాకు కూడా 20 ఏళ్ళు ఇచి మిగతా 40
ఏళ్ళు నువ్వే తీసుకో…
దేవుడు: సరే…
తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.
దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ
జీవితాన్ని ఆనందించు.. నేను నీఎకు 20
ఏళ్ళు ఆయుషు ని ఇస్తునాను.
మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20
ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి
మరియు కుక్కకి ఇచిన 10,10 మొత్తం 80 కావాలి…
దేవుడు: సరే…
అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు,
నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు,
ఆనందిస్తున్నాడు.. తరవాత 40
ఏళ్ళు ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి
సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు ఆ
తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన
మనవల్లు మనవరల్లని నవ్విస్తున్నాడు.. తరవాత
10 ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని
అరుస్తుంటాడు….!!
పాపాలు
ఒకసారి
ఒక వ్యాపారి దుకాణం తెరవగానే ఒక సాధువు వచ్చి ధర్మం అడిగాడు .. పోవయ్యా పో
అన్నాడు వ్యాపారి . మళ్ళి ఘంట తరువాత అదే సాధువు వచ్చి ధర్మం అడిగాడు .
మళ్ళి పోవయ్యా పో అన్నాడు వ్యాపారి ... ఇలా ఘంటకు ఒకసారి సాధువు వచ్చి
బిక్ష అడగటం వ్యాపారి పోవయ్యా పో అనడం రోజంతా జరిగింది .
వ్యాపారి దుకాణం మూసే టైం అయ్యింది . అప్పుడు కూడా చివరగా సాధువు బిక్ష అడిగేసరికి వ్యాపారి అన్నాడు నేను లేదు పోవయ్యా అని పొద్దున్నే చెప్పా .. నువ్వు అప్పుడే వెళ్లి పోయి మిగిలిన చోట్ల బిక్ష అడిగితె పోయేది కదా నీ జోలె నిండేది అన్నాడు .
అప్పుడు సాధువు నువ్వు బిక్ష ఇవ్వక పొతే పోనీలే కాని ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి నీవు సమాధానం అయినా ఇవ్వు అన్నాడు .
? అని వ్యాపారి మొహం పెట్టాడు . సాధువు అన్నాడు నీవు ఏమీ తినకుండా ,కనీసం కాఫీ నీళ్ళు అయినా తాగకుండా పొద్దున్న నుంచి జనాలను మోసం చేసి వ్యాపారం చేస్తున్నావు ఇదంతా ఎవరి కోసం అన్నాడు ...
అప్పుడు వ్యాపారి నాకు భార్య పిల్లలు ఉన్నారు వారి కోసం అన్నాడు . మరి నీవు చేసిన పాపలలో వారు బాగం పంచుకుంటారా అని అన్నాడు .. అడిగి చెప్తాను అన్నాడు వ్యాపారి .
డిన్నర్ టైం లో వ్యాపారి భార్యా పిల్లలను అడిగాడు నేను మీ కొరకు సంపాదిస్తున్నాను కదా మరి నా పాపాలలో భాగం పంచుకుంటారా అని .
"నీవు తండ్రి కాబట్టి సంపాదిస్తున్నావు . అమ్మ వంట చేసి పెడుతుంది కాబట్టి తింటున్నాము ఇంత కంటే మాకు ఏమీ తెలవదు .. మేమైతే మంచోల్లమే..నీ పాపాలు మేము పంచుకోము" అన్నారు పిల్లలు .
"నీవు ఎలా సంపాదిస్తున్నావో నాకు తెలవదు . నీవు ఎంత సంపాదించినా కూడా ఉన్న దాంట్లో adjust చేయడం మాత్రం నాకు తెల్సు .నిన్ను పాపాలు చేయమని నేనెప్పుడు చెప్పలేదు . నేను మంచిదాన్నే . కాబట్టి నీ పాపాలు నేను పంచుకోను "అని చెప్పింది భార్య ..
ఇప్పుడు వ్యాపారి ఆలోచించే సరికి దేవుడి దృష్టిలో భార్య పిల్లలు మంచోల్లే ..కాని ఆకలి ఉన్న మనిషి దగ్గరికి వచ్చి బిక్ష అడిగితె వేయనందుకు , జనాలను మోసం చేసి సంపాదించిన సంపద వల్ల తాను పాపాత్ముడు అయ్యాడు . నీతి::: నీకు ఎన్ని భాద్యతలు ఉన్నా , అప్పులు ఉన్నా న్యాయాన్ని విడిచి పెట్టకు . ఇప్పుడు కాకపోయినా next జన్మలో అయినా కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే . పంచుకోడానికి ఎవరు ఉండరు . నీ భాగస్వామి నీవు జీవించి ఉన్నంత వరకు జీవితాన్ని పంచుకుంటుంది కాని పాపాలను కాదు
వ్యాపారి దుకాణం మూసే టైం అయ్యింది . అప్పుడు కూడా చివరగా సాధువు బిక్ష అడిగేసరికి వ్యాపారి అన్నాడు నేను లేదు పోవయ్యా అని పొద్దున్నే చెప్పా .. నువ్వు అప్పుడే వెళ్లి పోయి మిగిలిన చోట్ల బిక్ష అడిగితె పోయేది కదా నీ జోలె నిండేది అన్నాడు .
అప్పుడు సాధువు నువ్వు బిక్ష ఇవ్వక పొతే పోనీలే కాని ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి నీవు సమాధానం అయినా ఇవ్వు అన్నాడు .
? అని వ్యాపారి మొహం పెట్టాడు . సాధువు అన్నాడు నీవు ఏమీ తినకుండా ,కనీసం కాఫీ నీళ్ళు అయినా తాగకుండా పొద్దున్న నుంచి జనాలను మోసం చేసి వ్యాపారం చేస్తున్నావు ఇదంతా ఎవరి కోసం అన్నాడు ...
అప్పుడు వ్యాపారి నాకు భార్య పిల్లలు ఉన్నారు వారి కోసం అన్నాడు . మరి నీవు చేసిన పాపలలో వారు బాగం పంచుకుంటారా అని అన్నాడు .. అడిగి చెప్తాను అన్నాడు వ్యాపారి .
డిన్నర్ టైం లో వ్యాపారి భార్యా పిల్లలను అడిగాడు నేను మీ కొరకు సంపాదిస్తున్నాను కదా మరి నా పాపాలలో భాగం పంచుకుంటారా అని .
"నీవు తండ్రి కాబట్టి సంపాదిస్తున్నావు . అమ్మ వంట చేసి పెడుతుంది కాబట్టి తింటున్నాము ఇంత కంటే మాకు ఏమీ తెలవదు .. మేమైతే మంచోల్లమే..నీ పాపాలు మేము పంచుకోము" అన్నారు పిల్లలు .
"నీవు ఎలా సంపాదిస్తున్నావో నాకు తెలవదు . నీవు ఎంత సంపాదించినా కూడా ఉన్న దాంట్లో adjust చేయడం మాత్రం నాకు తెల్సు .నిన్ను పాపాలు చేయమని నేనెప్పుడు చెప్పలేదు . నేను మంచిదాన్నే . కాబట్టి నీ పాపాలు నేను పంచుకోను "అని చెప్పింది భార్య ..
ఇప్పుడు వ్యాపారి ఆలోచించే సరికి దేవుడి దృష్టిలో భార్య పిల్లలు మంచోల్లే ..కాని ఆకలి ఉన్న మనిషి దగ్గరికి వచ్చి బిక్ష అడిగితె వేయనందుకు , జనాలను మోసం చేసి సంపాదించిన సంపద వల్ల తాను పాపాత్ముడు అయ్యాడు . నీతి::: నీకు ఎన్ని భాద్యతలు ఉన్నా , అప్పులు ఉన్నా న్యాయాన్ని విడిచి పెట్టకు . ఇప్పుడు కాకపోయినా next జన్మలో అయినా కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే . పంచుకోడానికి ఎవరు ఉండరు . నీ భాగస్వామి నీవు జీవించి ఉన్నంత వరకు జీవితాన్ని పంచుకుంటుంది కాని పాపాలను కాదు
ఐకమత్యం
ఇద్దరు
అన్నదమ్ములు నలభైయేళ్ల పాటు కలిసి సంతోషముగా ఉండేవారు. ఇద్దరు ఎదురెదురు
పొలాల్లోనివసించేవారు. యంత్రాలు వాడుకోవడం, వ్యాపారానికి కావలసిన
వస్తువులు, అన్నీ కలిసి పంచుకునే వారు.
ఇంతలో చిన్న మాట తేడా వల్ల, ఇద్దరికి అభిప్రాయభేదాలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండేవారు. తరువాత ఆ మౌనం, కఠినమైన మాటలుగా మారింది. తరువాత ఇద్దరు పూర్తిగా మాట్లాడుకోలేదు.
ఒక రోజు జాన్ ఇంటి తలుపు ఎవరో తట్టేరు. తలుపు తెరవగానే, ఒక వడ్రంగి, తన పనిముట్టు సామాన్లతో నుంచుని ఉన్నాడు.'ఒక రోజు పని ఏమైన ఇప్పించ గలరా' అని వడ్రంగి అడిగేడు. నా దగ్గర ఒక పని ఉంది అని జాన్ చెప్పాడు
.
ఎదురుగా ఉండేది, నా తమ్ముడే. కొద్దిరోజులుగా, మేము మాట్లాడుకోవడం లేదు.కొన్ని రోజుల క్రితం పొలం దున్నడానికి, యంత్రం తీసుకుని వెళ్లాడు. అప్పటి నుంచి మాకు గొడవ అయింది. అందుకని నేను ఏమైనా చేసి వాడికి గుణపాఠం చెప్పాలి. అక్కడ ఉన్నసామాన్లతో ఒక ఎనిమిది అడుగుల గోడ, రెండు పొలాలకి మధ్య కట్టమని అడిగేడు. అలాకట్టటం వల్ల, రేపటి నుంచి వాడి మొహం చూడక్కర్లేధు, అని చెప్పాడు. వడ్రంగికి కావలిసిన సామాన్లు ఇచ్చి జాన్ పనిమీద, పట్టణం వెళ్లాడు.
వడ్రంగి రోజు అంతా కష్టపడి పని చేశాడు. సాయంకాలం జాన్ రాగానే, పని అయిపోయిందని చెప్పాడు.
ఆశ్చర్యంగా చూసాడు జాన్. గోడ లేదు, కానీ ఒక వంతెన ఉంది. ఆ వంతెన రెండు పొలాలకి మధ్య కట్టేడు వడ్రంగి. చూడడానికి అధ్భుతంగా ఉంది.
వంతెనకి అటువైపు నుంచి చూస్తే, తమ్ముడు, చేతులు చాచి అన్న దగ్గరికి వస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు వంతెన మధ్యలో నుంచుని, చేతులు పట్టుకున్నారు. వడ్రంగి తన సామాన్లు పట్టుకుని వెళ్ళి పోతున్నపుడు, అతన్ని ఆపి, మాకు ఇంకా చాలా పనులు, చేసి పెట్టాలి అని అన్నారు. దానికి వడ్రంగి ,నాకు ఉండడం ఇష్టమే, కానీ ఇంకా చాలా వంతెనలు కట్టాలి అని అన్నాడు.
నీతి: మనుషులతో సంబంధాలు తెంచుకోవడం సులభం, కాని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం.ఏ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయభేదాలు రావడం సహజం,వాటిని పక్కనపెట్టి, అనుబంధం నిలుపుకునే ప్రయత్నం ఇద్దరూ చెయ్యాలి.అహంకారం , ద్వేషం అడ్డుగోడలుగా ఉన్నప్పుడు ప్రేమతో వాటిని దాటే ప్రయత్నం చెయ్యాలి.
ఎంత ఆడంబరంగా జీవించాము అన్నదానికన్న, ఎంతమందికి సహాయపడ్డాము అన్నది ముఖ్యం. మనకి ఎంతోమంది స్నేహితులు ఉండచ్చు, అందులో ఎంతమంది మనని నిజమైన స్నేహితులుగా భావిస్తున్నారో తెలుసుకోవాలి.అందం, డబ్బు, ఆడంబరాలు మొదలైనవాటివల్ల మనిషికి గుర్తింపు రాదు, అహకారం వస్తుంది, అది మన వ్యక్తిత్వాన్ని పాడుచేస్తుంది.
ఒక మనిషిగా ఎప్పటికీ గుర్తింపు పొందాలి అన్నా, సమజానికి ఉపయోగపడాలి అన్నా అది ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది.
ఇంతలో చిన్న మాట తేడా వల్ల, ఇద్దరికి అభిప్రాయభేదాలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండేవారు. తరువాత ఆ మౌనం, కఠినమైన మాటలుగా మారింది. తరువాత ఇద్దరు పూర్తిగా మాట్లాడుకోలేదు.
ఒక రోజు జాన్ ఇంటి తలుపు ఎవరో తట్టేరు. తలుపు తెరవగానే, ఒక వడ్రంగి, తన పనిముట్టు సామాన్లతో నుంచుని ఉన్నాడు.'ఒక రోజు పని ఏమైన ఇప్పించ గలరా' అని వడ్రంగి అడిగేడు. నా దగ్గర ఒక పని ఉంది అని జాన్ చెప్పాడు
.
ఎదురుగా ఉండేది, నా తమ్ముడే. కొద్దిరోజులుగా, మేము మాట్లాడుకోవడం లేదు.కొన్ని రోజుల క్రితం పొలం దున్నడానికి, యంత్రం తీసుకుని వెళ్లాడు. అప్పటి నుంచి మాకు గొడవ అయింది. అందుకని నేను ఏమైనా చేసి వాడికి గుణపాఠం చెప్పాలి. అక్కడ ఉన్నసామాన్లతో ఒక ఎనిమిది అడుగుల గోడ, రెండు పొలాలకి మధ్య కట్టమని అడిగేడు. అలాకట్టటం వల్ల, రేపటి నుంచి వాడి మొహం చూడక్కర్లేధు, అని చెప్పాడు. వడ్రంగికి కావలిసిన సామాన్లు ఇచ్చి జాన్ పనిమీద, పట్టణం వెళ్లాడు.
వడ్రంగి రోజు అంతా కష్టపడి పని చేశాడు. సాయంకాలం జాన్ రాగానే, పని అయిపోయిందని చెప్పాడు.
ఆశ్చర్యంగా చూసాడు జాన్. గోడ లేదు, కానీ ఒక వంతెన ఉంది. ఆ వంతెన రెండు పొలాలకి మధ్య కట్టేడు వడ్రంగి. చూడడానికి అధ్భుతంగా ఉంది.
వంతెనకి అటువైపు నుంచి చూస్తే, తమ్ముడు, చేతులు చాచి అన్న దగ్గరికి వస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు వంతెన మధ్యలో నుంచుని, చేతులు పట్టుకున్నారు. వడ్రంగి తన సామాన్లు పట్టుకుని వెళ్ళి పోతున్నపుడు, అతన్ని ఆపి, మాకు ఇంకా చాలా పనులు, చేసి పెట్టాలి అని అన్నారు. దానికి వడ్రంగి ,నాకు ఉండడం ఇష్టమే, కానీ ఇంకా చాలా వంతెనలు కట్టాలి అని అన్నాడు.
నీతి: మనుషులతో సంబంధాలు తెంచుకోవడం సులభం, కాని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం.ఏ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయభేదాలు రావడం సహజం,వాటిని పక్కనపెట్టి, అనుబంధం నిలుపుకునే ప్రయత్నం ఇద్దరూ చెయ్యాలి.అహంకారం , ద్వేషం అడ్డుగోడలుగా ఉన్నప్పుడు ప్రేమతో వాటిని దాటే ప్రయత్నం చెయ్యాలి.
ఎంత ఆడంబరంగా జీవించాము అన్నదానికన్న, ఎంతమందికి సహాయపడ్డాము అన్నది ముఖ్యం. మనకి ఎంతోమంది స్నేహితులు ఉండచ్చు, అందులో ఎంతమంది మనని నిజమైన స్నేహితులుగా భావిస్తున్నారో తెలుసుకోవాలి.అందం, డబ్బు, ఆడంబరాలు మొదలైనవాటివల్ల మనిషికి గుర్తింపు రాదు, అహకారం వస్తుంది, అది మన వ్యక్తిత్వాన్ని పాడుచేస్తుంది.
ఒక మనిషిగా ఎప్పటికీ గుర్తింపు పొందాలి అన్నా, సమజానికి ఉపయోగపడాలి అన్నా అది ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది.
Thursday, March 6, 2014
కర్తవ్యమే భవిష్యత్ సూచిక ....!?
రోడ్డుపై వెళ్తున్న ఓ బాటసారి హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయి అపస్మారక స్థితిలో అలాగే కూలబడ్డాడు. అయితే ఆ దారిలో వెళ్తున్న ఏ ఒక్కరు కూడా అతన్ని సమీపించేందుకు ప్రయత్నించలేదు. తమ పనులు తాము చూసుకోసాగారు. అందులో కొంతమందేమో బాగా తాగి పడిపోయాడని భావించారు.
అయితే చివరగా అటువైపే వెళ్తున్న ఓ సాధారణ వ్యక్తి అతగాడి పరిస్థితికి జాలిపడ్డాడు. అతడిని సమీపించి అతని నాడిని పరీక్షించి ముఖం మీద నీళ్లు చల్లి, ఓ గుక్కెడు నీళ్లు తాగించాడు. కాసేపటికి సొమ్మసిల్లి పడిపోయిన బాటసారికి తెలివొచ్చింది. వెంటనే తనను కాపాడిన వ్యక్తికి పదేపదే ధన్యవాదాలు తెలుపుకున్నాడు.
సరైన సమయంలో ఆదుకున్నందుకు గాను తగినంత బహుమతి కోరాల్సిందిగా సూచించాడు బాటసారి. నేను మీకు ఏమి చేయాలో దయచేసి చెప్పాల్సిందిగా తనకు సాయం చేసిన వ్యక్తిని మళ్లీ అడిగాడు. దానికా వ్యక్తి నేను డబ్బు కోసమో లేదా ఏ స్వలాభం కోసమో మీకు సాయం చేయలేదని సావధానంగా సమాధానమిచ్చాడు. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఈ పని చేశానని వివరించాడు.
కానీ బాటసారి మాత్రం వదలలేదు. ప్రతిఫలంగా ఏదో తీసుకోందే తన మనసు తృప్తి చెందదని విజ్ఞప్తి చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఇలా అన్నాడు. "ప్రకృతిని ఓ సారి చూడండి, అద్భుతమైన వృక్షాలు, అందమైన పక్షులు, పచ్చటి ఆకులు, నీలిరంగులోని ఆకాశాన్ని చూడండి. అవి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతృప్తినిస్తాయి. కానీ ప్రతిఫలంగా అవి ఏమీ తీసుకోవు. నిజంగా మీరు నాకు ప్రతిఫలం ఇవ్వదలుచుకుంటే... ఇదే విధమైన సేవను మరొకరికి అవసరమైనప్పుడు చేయాల"ని బాటసారికి సూచించాడు. మీరు నాకిచ్చే ప్రతిఫలం అదే అని తెలిపాడు.
ఆ మాటలకు విస్తుపోయి చూసిన ఆ బాటసారి కనీసం పేరైనా చెప్పాలని ఆ వ్యక్తిని కోరాడు. "సేవకులకు భగవద్గీతలో ఎలాంటి పేరు లేదు. నేనెవరు.. నా పేరేంటి అన్నది ఇక్కడ విషయం కాదు. మీకు సాయం చేసే ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది అది చాలు" అని ఆ బాటసారికి చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు.
భగవద్గీతలోని కర్మయోగంలో ఈ అంశాన్ని పార్థుడికి శ్రీకృష్ణుడు బోధించడం తెలిసిందే కదా. దీని అర్ధం... ఎలాంటి సంబంధాలు లేకున్నా... ప్రతిఫలాన్ని ఆశించకుండా మన కర్తవ్యాలను స్వచ్ఛందంగా నిర్వర్తించాలి. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లయితే.. వారి వారి వ్యక్తిగత భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నియంత్రించవచ్చు. కనుక కర్తవ్యమే భవిష్యత్ సూచిక.
అమ్మ
ఒక్క
బాబు రోజు స్కూల్ కి వెళ్ళే వాడు దారి లో ఒక్క పార్క్ ఉండేది ఆ పార్క్ నీ
చూస్తూ అలా తన స్కూల్ కి రోజు వెళ్ళేటప్పుడు వచేటప్పుడు చూస్తూ ఉండేవాడు...
ఐతే ఆ పార్క్ లో రోజు ఒక్క జంట ఆనందం గా కనిపించేది ఆ అబ్బాయి కి వాళ్ళని రోజు గమనించే వాడు...
అప్పుడపుడు సాయంత్రం వాళ్ళని చూస్తూ ఒక్కొక్క సారి ఇంటికి వెళ్ళటం లేట్ అయ్యేది బాబు కి ఐతే కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడ జంట గా ఉండాల్సిన వాళ్ళు లేరు కొన్ని రోజులు వాళ్ళు కనిపించలేదు....
వాళ్ళని పార్క్ అంత వెతికాడు కానీ కనిపించలేదు....
సర్లే ఇంకా వాళ్ళు రారు అని అనుకుని బాబు ఇంటికి వెళ్ళిపోయాడు....
రోజు చూసే వాడు ఆయన వాళ్ళు మళ్ళి కనిపించలేదు కానీ ఒక్క రోజు సాయత్రం ఆ బాబు అక్కడ ఆ జంట లోని అబ్బాయి నీ చూసాడు....
చూడగానే ఆనందం తో పరిగేతుకు వెళ్ళాడు....
అక్కడ కూర్చున్న అబ్బాయి ఎం కావాలి అని అడిగాడు...??
బాబు ఎం అడగాలో తెలియక నీతో పాటు ఒక్క అక్క ఉండాలి కదా తను ఎక్కడ అని అడిగాడు...???
అప్పుడు అబ్బాయి తను నీకు ఎలా తెలుసా అని అడిగాడు...??
అప్పుడు బాబు చూసింది అంత చెప్పాడు...
అబ్బాయి అప్పుడు మీ అక్క నన్ను వదిలేసింది అందుకే నేను ఒంటరిగా ఇక్కడే కూర్చున్న మార్నింగ్ నుండి అని చెప్పాడు...
ఓహ్ అలా జరిగిందా సర్లే నేను వెలుతున్న అని చెప్పాడు...
అప్పుడు చూసావా నువ్వు కూడా నా గురించి అడగకుండా వెళ్ళిపోతున్నావ్ అన్నాడు....
అప్పుడు ఏమో బాబు అదంతా తెలియదు నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నా కోసం బెంగ పెట్టుకుంటుంది అందరిని అడుగుతుంది అందుకే నేను వెళ్ళాలి అని చెప్పా ఏ నీ కోసం మీ అమ్మ ఎదురు చుడదా ఏంటి మీ ఇంట్లో ఇక్కడ కుర్చునావ్ ఏడుస్తూ అని అడిగాడు....??
అంతే ఆ అబ్బాయి త్వరగా అక్కడి నుండి లేచి ఆ బాబు నీ వాళ్ళ ఇంటిదగ్గర దించి తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు....
మంచి మాటలు చెప్పాలి అంటే పుస్తకాలూ చదవాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద వారితో మాట్లాడాల్సిన అవసరం లేదు చిన్న పిల్లల కల్మషం లేని మాటలు విన్న చాలు మనం ఎం తప్పు చేస్తున్నామో మనకి అర్ధం అవుతుంది...
మనకోసం ఎదురు చూసే ప్రియురాలు లేకపోవచు కానీ మనం ఎప్పుడు వస్తామా అని ఎదురు చూసే అమ్మ ప్రతి ఇంట్లో ఉంటుంది...
ఐతే ఆ పార్క్ లో రోజు ఒక్క జంట ఆనందం గా కనిపించేది ఆ అబ్బాయి కి వాళ్ళని రోజు గమనించే వాడు...
అప్పుడపుడు సాయంత్రం వాళ్ళని చూస్తూ ఒక్కొక్క సారి ఇంటికి వెళ్ళటం లేట్ అయ్యేది బాబు కి ఐతే కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడ జంట గా ఉండాల్సిన వాళ్ళు లేరు కొన్ని రోజులు వాళ్ళు కనిపించలేదు....
వాళ్ళని పార్క్ అంత వెతికాడు కానీ కనిపించలేదు....
సర్లే ఇంకా వాళ్ళు రారు అని అనుకుని బాబు ఇంటికి వెళ్ళిపోయాడు....
రోజు చూసే వాడు ఆయన వాళ్ళు మళ్ళి కనిపించలేదు కానీ ఒక్క రోజు సాయత్రం ఆ బాబు అక్కడ ఆ జంట లోని అబ్బాయి నీ చూసాడు....
చూడగానే ఆనందం తో పరిగేతుకు వెళ్ళాడు....
అక్కడ కూర్చున్న అబ్బాయి ఎం కావాలి అని అడిగాడు...??
బాబు ఎం అడగాలో తెలియక నీతో పాటు ఒక్క అక్క ఉండాలి కదా తను ఎక్కడ అని అడిగాడు...???
అప్పుడు అబ్బాయి తను నీకు ఎలా తెలుసా అని అడిగాడు...??
అప్పుడు బాబు చూసింది అంత చెప్పాడు...
అబ్బాయి అప్పుడు మీ అక్క నన్ను వదిలేసింది అందుకే నేను ఒంటరిగా ఇక్కడే కూర్చున్న మార్నింగ్ నుండి అని చెప్పాడు...
ఓహ్ అలా జరిగిందా సర్లే నేను వెలుతున్న అని చెప్పాడు...
అప్పుడు చూసావా నువ్వు కూడా నా గురించి అడగకుండా వెళ్ళిపోతున్నావ్ అన్నాడు....
అప్పుడు ఏమో బాబు అదంతా తెలియదు నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నా కోసం బెంగ పెట్టుకుంటుంది అందరిని అడుగుతుంది అందుకే నేను వెళ్ళాలి అని చెప్పా ఏ నీ కోసం మీ అమ్మ ఎదురు చుడదా ఏంటి మీ ఇంట్లో ఇక్కడ కుర్చునావ్ ఏడుస్తూ అని అడిగాడు....??
అంతే ఆ అబ్బాయి త్వరగా అక్కడి నుండి లేచి ఆ బాబు నీ వాళ్ళ ఇంటిదగ్గర దించి తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు....
మంచి మాటలు చెప్పాలి అంటే పుస్తకాలూ చదవాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద వారితో మాట్లాడాల్సిన అవసరం లేదు చిన్న పిల్లల కల్మషం లేని మాటలు విన్న చాలు మనం ఎం తప్పు చేస్తున్నామో మనకి అర్ధం అవుతుంది...
మనకోసం ఎదురు చూసే ప్రియురాలు లేకపోవచు కానీ మనం ఎప్పుడు వస్తామా అని ఎదురు చూసే అమ్మ ప్రతి ఇంట్లో ఉంటుంది...
హిందువు నని గర్వించు
స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఓ అమెరికా వనిత వచ్చి స్వామిని ఇలా అడిగింది.
"స్వామీ మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీరు అంగీకరిస్తారా"
స్వామి ఆమెను "మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది" అని అడిగారు.
అందుకామె " మీ తెలివితేటలు నాకు నచ్చాయి. అందుచేత మిమ్మల్ని పెళ్ళాడి మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది" అన్నది.
స్వామి ఆమె మాటలకి ఇలా సమాధానమిచ్చారు.
" నాతెలివితేటలు మిమ్మల్ని ఆకర్షించాయి కాబట్టి మీ కోరికను తప్పు బట్టను. నాలాంటి బిడ్డను కావాలనుకోవడం తప్పు కాదు కాబట్టి. కాని దానికి పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ బిడ్డను కనడం చాలా సమయం పడుతుంది. పైగా అలా జరుగుతుందని నిశ్చయముగా చెప్పలేము. మీ కోరిక తీరడానికి, నిశ్చయమైన సులువైన మార్గము ఒకటి చెబుతాను. ఇప్పుడే నేను మిమ్మల్ని నా తల్లిగా స్వీకరిస్తున్నాను. మీరు నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. నావంటి తెలివితేటలు కలిగిన వ్యక్తిని బిడ్డగా పోందాలనే మీ కోరిక ఇప్పుడే నెరవేరింది." అని ఆమెకు నమస్కరించారు.
వివేకానందుడి మాటలకు ఆ అమెరికా వనిత అవాక్కయింది.
ఉత్తిష్ఠత జాగృత. ప్రాప్యవరాన్ని బోధత-. లే. మేల్కో. పొందవలసినదీ, చేరవలసిన గమ్యం గూర్చి తెలుసుకో
సనాతన ధర్మాన్ని పాటిస్తూ, హిందువునని ఆ వివేకానందుడి వారసులమని గర్వంగా చెప్పుకో.
"స్వామీ మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీరు అంగీకరిస్తారా"
స్వామి ఆమెను "మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది" అని అడిగారు.
అందుకామె " మీ తెలివితేటలు నాకు నచ్చాయి. అందుచేత మిమ్మల్ని పెళ్ళాడి మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది" అన్నది.
స్వామి ఆమె మాటలకి ఇలా సమాధానమిచ్చారు.
" నాతెలివితేటలు మిమ్మల్ని ఆకర్షించాయి కాబట్టి మీ కోరికను తప్పు బట్టను. నాలాంటి బిడ్డను కావాలనుకోవడం తప్పు కాదు కాబట్టి. కాని దానికి పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ బిడ్డను కనడం చాలా సమయం పడుతుంది. పైగా అలా జరుగుతుందని నిశ్చయముగా చెప్పలేము. మీ కోరిక తీరడానికి, నిశ్చయమైన సులువైన మార్గము ఒకటి చెబుతాను. ఇప్పుడే నేను మిమ్మల్ని నా తల్లిగా స్వీకరిస్తున్నాను. మీరు నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. నావంటి తెలివితేటలు కలిగిన వ్యక్తిని బిడ్డగా పోందాలనే మీ కోరిక ఇప్పుడే నెరవేరింది." అని ఆమెకు నమస్కరించారు.
వివేకానందుడి మాటలకు ఆ అమెరికా వనిత అవాక్కయింది.
ఉత్తిష్ఠత జాగృత. ప్రాప్యవరాన్ని బోధత-. లే. మేల్కో. పొందవలసినదీ, చేరవలసిన గమ్యం గూర్చి తెలుసుకో
సనాతన ధర్మాన్ని పాటిస్తూ, హిందువునని ఆ వివేకానందుడి వారసులమని గర్వంగా చెప్పుకో.
Subscribe to:
Posts (Atom)